ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కైలాస మానస సరోవరం!
- హిమాలయాల్లో ఉన్న మానస సరోవరం
- భారత పరిధిలోని ప్రాంతానికి యునెస్కో గుర్తింపు
- వెల్లడించిన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ
గడచిన ఏప్రిల్ లో భారత పురావస్తు విభాగం నుంచి వెళ్లిన ప్రతిపాదనలను చర్చించిన యునెస్కో, ఈ మేరకు ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది. కాగా, కైలాస మానస సరోవరం ప్రాంతంలో ఎక్కువ భాగం భారత్ లో ఉండగా, నేపాల్, ఉత్తరాన చైనాల పరిధిలోనూ కొంత ఉందన్న సంగతి తెలిసిందే. మూడు దేశాల పరిధిలో 31 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ పవిత్ర సరస్సు విస్తరించివుంది. కాగా, తమ దేశాల పరిధిలోని మానస సరోవరం ప్రాంతాలను కూడా వారసత్వ ప్రదేశంగా గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి.