‘మహానటి’కి అరుదైన ఘనత.. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు!
- సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా
- ఇంటర్నేషనల్ పనోరమ విభాగంలో ఎంపిక
- మెయిన్ల్యాండ్ చైనాలో సందడి చేయనున్న ‘మహానటి’
వైజయంతీ మూవీస్- స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటి కీర్తి సురేశ్ టైటిల్ పాత్రలో నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్స్ అందరూ ఈ చిత్రంలో నటించారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.