మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ
- సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే కీలకమన్న ఇమ్రాన్
- ఉగ్రవాదానికి సంబంధించి లేఖలో లేని ప్రస్తావన
- చర్చలకు భారత్ సిద్ధంగా లేదన్న ఓ ఉన్నతాధికారి
ద్వైపాక్షిక చర్చలు జరుపుతామంటూ గత సెప్టెంబర్ లో కూడా మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. చర్చలకు భారత్ కూడా సిద్ధమైంది. అయితే, కశ్మీర్ సరిహద్దులో ఒక బీఎస్ఎఫ్ జవాను, ముగ్గురు ఎస్పీవోలను పాక్ హతమార్చడంతో... చర్చలు జరపాలన్న నిర్ణయాన్ని కేవలం ఒక్క రోజులోనే భారత్ రద్దు చేసుకుంది. ఉగ్రవాదంపై పటిష్ట చర్యలను తీసుకునేంత వరకు పాక్ తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది.