భార్య, రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన వ్యక్తి!

  • వనస్థలిపురం పరిధిలో దారుణం
  • భార్యాబిడ్డలను హతమార్చిన ఆదిల్
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భార్యతో పాటు రెండేళ్ల కుమారుడిని దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని ఆటో నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆదిల్ అనే వ్యక్తి తన భార్య, రెండేళ్ల కుమారుడిని దారుణంగా హతమార్చి, శవాలను డ్రమ్ములో దాచి పెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Go Back to Shorts
Aadil
Hyderabad
Vanastalipuram
Police

More Telugu News