తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఆవేదనగా స్పందించిన కేటీఆర్!
- తెలంగాణలో 23 మంది విద్యార్థుల ఆత్మహత్య
- కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజన్
- ఆవేదనతో స్పందించిన టీఆర్ఎస్ నేత
దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘నన్ను ఏం క్లారిఫికేషన్ ఇవ్వమంటారు సార్? మన రాష్ట్రంలో జరిగింది నిజంగా దురదృష్టకరమైన ఘటన. ఈ ఘటన వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. నేను ఓ తండ్రినే.. పిల్లలను కోల్పోయిన అమ్మానాన్నల బాధను అర్థం చేసుకోగలను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో ఓ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్న మరో నెటిజన్ సూచనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.