Telangana: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు.. నివేదిక అందజేయనున్న త్రిసభ్య కమిటీ

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు, గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తించింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ అందజేయనుంది. తెలంగాణ సీఎస్ జోషికి ఈ నివేదిక అందజేస్తుందని సమాచారం.

కాగా, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ నిశాంక్, ప్రొఫెసర్ వాసన్ ఉన్నారు.  ఈ వ్యవహారానికి సంబంధించి  మూడు రోజులుగా విచారణను కమిటీ చేపట్టింది. నిన్న రాత్రి 8 గంటలకు నివేదికను పూర్తి చేసింది. ఈ నివేదికను కొద్ది సేపట్లో ప్రభుత్వానికి సమర్పించనుంది.
Go Back to Shorts
Telangana
Intermediate
committee
globarina

More Telugu News