భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి

  • పోలింగ్ సందర్భంగా వీరాపురంలో దాడులకు తెగబడ్డ టీడీపీ, వైసీపీ శ్రేణులు
  • వేట కొడవళ్లు, కర్రలతో దాడి
  • భాస్కర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానన్న ప్రభాకర్ రెడ్డి
పోలింగ్ సందర్భంగా హత్యకు గురైన తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ నేత భాస్కర్ రెడ్డి మృతదేహానికి ఆ పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాళి అర్పించారు. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాస్కర్ రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

నిన్న పోలింగ్ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు వేట కొడవళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీడీపీ నేత భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి హతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాడిపత్రి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీరాపురం గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉంది. తాడిపత్రిలో కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 300 మందితో కూడిన కేంద్ర బలగాలు మోహరించాయి.
Go Back to Shorts
jc prabhakar reddy
tadipatri

More Telugu News