మా అమ్మానాన్నల పెళ్లి తేదీని ఇందిరా గాంధీ ఫిక్స్ చేశారు: అమీషా పటేల్
- గాంధీ కుటుంబంతో తమకున్న బంధాన్ని పంచుకున్న అమీషా పటేల్
- తాను పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన తొలి వ్యక్తి ఇందరేనన్న నటి
- ఇందిరా గాంధీకి తన తాతయ్య రజనీ పటేల్ ప్రధాన సలహాదారుగా ఉండేవారని వెల్లడి
బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్ తన కుటుంబానికి, గాంధీ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల నాటి బంధం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రుల వివాహ తేదీని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా నిర్ణయించారని, తాను పుట్టినప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన మొదటి వ్యక్తి కూడా ఆమేనని వెల్లడించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీషా తన తాతయ్య, ప్రముఖ బారిస్టర్ రజనీ పటేల్ గురించి వివరించారు. "మా తాతయ్య రజనీ పటేల్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయనకు జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకులు. కాంగ్రెస్లో చేరాక ఆయన ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, ప్రధాన సలహాదారుడిగా మారారు. పార్టీ కోశాధికారిగా, అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇందిరా గాంధీ ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా మా తాతయ్య అభిప్రాయం తీసుకునేవారు" అని అమీషా తెలిపారు.
తన తల్లిదండ్రుల వివాహం గురించి మాట్లాడుతూ "మా అమ్మానాన్నల జాతకాలు కలవలేదు. దాంతో పెళ్లి తేదీ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మా తాతయ్య ఇందిరా గాంధీని 'మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు?' అని అడిగారు. ఆమె చెప్పిన తేదీనే నా తల్లిదండ్రుల పెళ్లి తేదీగా ఖరారు చేశారు" అని అమీషా వివరించారు.
అంతేకాదు, "నేను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పుట్టినప్పుడు, నన్ను చూసేందుకు వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీయే" అని ఆమె గుర్తుచేసుకున్నారు. ముంబైలోని నెహ్రూ ప్లానిటోరియంను కూడా తన తాతయ్యే నిర్మించారని ఆమె పేర్కొన్నారు. 'కహో నా... ప్యార్ హై' చిత్రంతో అరంగేట్రం చేసిన అమీషా, ఇటీవలే 'గదర్ 2'తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీషా తన తాతయ్య, ప్రముఖ బారిస్టర్ రజనీ పటేల్ గురించి వివరించారు. "మా తాతయ్య రజనీ పటేల్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయనకు జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకులు. కాంగ్రెస్లో చేరాక ఆయన ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, ప్రధాన సలహాదారుడిగా మారారు. పార్టీ కోశాధికారిగా, అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇందిరా గాంధీ ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా మా తాతయ్య అభిప్రాయం తీసుకునేవారు" అని అమీషా తెలిపారు.
తన తల్లిదండ్రుల వివాహం గురించి మాట్లాడుతూ "మా అమ్మానాన్నల జాతకాలు కలవలేదు. దాంతో పెళ్లి తేదీ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మా తాతయ్య ఇందిరా గాంధీని 'మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు?' అని అడిగారు. ఆమె చెప్పిన తేదీనే నా తల్లిదండ్రుల పెళ్లి తేదీగా ఖరారు చేశారు" అని అమీషా వివరించారు.
అంతేకాదు, "నేను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పుట్టినప్పుడు, నన్ను చూసేందుకు వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీయే" అని ఆమె గుర్తుచేసుకున్నారు. ముంబైలోని నెహ్రూ ప్లానిటోరియంను కూడా తన తాతయ్యే నిర్మించారని ఆమె పేర్కొన్నారు. 'కహో నా... ప్యార్ హై' చిత్రంతో అరంగేట్రం చేసిన అమీషా, ఇటీవలే 'గదర్ 2'తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.