వైసీపీ నేత పొట్లూరి షేర్ హోల్డర్లను మోసం చేశారు.. ఆయనపై సెబీ నిషేధం విధించింది!: కేశినేని నాని ఆరోపణ
- జగన్ కోసం మోదీ, కేసీఆర్ పనిచేస్తున్నారు
- పీవీపీ, జగన్ తో ఏపీకి అప్రతిష్ట
- విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
వైసీపీలో 97 మంది ఎమ్మెల్యే, 12 మంది లోక్ సభ అభ్యర్థులపై కేసులు ఉన్నాయని కేశినేని నాని దుయ్యబట్టారు. ఇక వైసీపీ అధినేత జగన్ పై అయితే ఏకంగా 31 కేసులు ఉన్నాయన్నారు. జగన్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) వంటి వ్యక్తులతో ఆంధ్రప్రదేశ్ కే అప్రతిష్ట అని నాని వ్యాఖ్యానించారు.
షేర్ హోల్డర్లను మోసం చేసినందుకు వైసీపీ నేత పీవీపీ వ్యాపార కార్యకలాపాలను సెబీ నిషేధించిందని గుర్తుచేశారు. వ్యాపారం చేయడానికి పీవీపీ పనికిరాడని అమెరికా బ్యాంకులే చెప్పాయన్నారు. గత ఎన్నికల్లో ఆలోచనతో వేసిన ఓటు అభివృద్ధికి కారణమయిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని కోరారు.