హైదరాబాద్ ‘మెట్రో’ గురించి కేంద్రం పట్టించుకోవట్లేదు: కేటీఆర్
- హైదరాబాద్ ‘మెట్రో’ను మరింత విస్తరించాలి
- ముంబై ‘మెట్రో’ విస్తరణకు రూ.18 వేల కోట్లు ఇచ్చారు
- మోదీ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పుకునే పరిస్థితి లేదు
కేంద్రం మెడలు వంచి నిధులు సాధిద్దాం
ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పుకునే పరిస్థితి లేదని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, కేంద్రం మెడలు వంచి అవసరమైనన్ని నిధులు సాధించవచ్చని, కేసీఆర్ లాంటి పోరాడే నాయకుడు ఉంటే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి అవసరమైనన్ని నిధులు సాధించవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని, తెలంగాణలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా, జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరితే మొండిచేయి చూపారని విమర్శించారు.