ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సెలవుల ప్రకటన

  • సెలవులపై అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు
  • ఏప్రిల్ 11 సెలవుగా ప్రకటన
  • 10, మే 23 స్థానిక సెలవులుగా వెల్లడి
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నేడు ఎన్నికల సెలవులపై ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ జరిగే రోజైన ఈ నెల 11ను సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పోలింగ్‌కు ముందు రోజు అంటే ఈ నెల 10తో పాటు, ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
Go Back to Shorts
Anil chandra punetha
Andhra Pradesh
Leaves
Poling
Counting

More Telugu News