ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న చిరంజీవి

  • కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ప్రచారం
  • చిరంజీవి, కొండా ఇద్దరూ బంధువులు
  • ఉపాసన చిన్నాన్నే కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. అయితే తన సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తరపున మాత్రం కాదు. తన పార్టీ కాంగ్రెస్ తరపునే ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించాలని చిరు నిర్ణయించారు. ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు, చిరంజీవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తన కోడలు ఉపాసనకు విశ్వేశ్వర్ రెడ్డి స్వయానా చిన్నాన్న అవుతారు. 
Go Back to Shorts
chiranjeevi
konda vishveshwar reddy
election campaign
tollywood
congress

More Telugu News