మరోసారి చెబుతున్నా... హోదా ఇచ్చి తీరుతాం: రాహుల్ గాంధీ
- మోదీపై ఒత్తిడి తేలేకపోయిన ప్రాంతీయ పార్టీలు
- ఇండియాలోనే అగ్రగామిగా ఏపీని నిలుపుతాం
- ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్న రాహుల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలోనే అగ్రగామిగా మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడివుందని చెప్పిన రాహుల్ గాంధీ, తమ మేనిఫెస్టోలో ఓ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. పేదరికాన్ని తరిమివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, పేదలకు కనీస ఆదాయ పథకాన్ని అందిస్తామని చెప్పారు. మహిళాభ్యుదయానికి, మహిళల ఉన్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ కోరారు.