ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తే ప్రధాని అవుతారు.. ఢిల్లీని యాచించం.. శాసిస్తాం: కేటీఆర్
- మద్దతు లేకుండా గద్దెనెక్కే పరిస్థితి లేదు
- అధికారంలో ఉండి పార్టీలేం చేశాయి
- సర్వేలో కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు
ఎన్నికల అనంతరం ఢిల్లీని యాచించడం కాదని, శాసిస్తామని అన్నారు. అభివృద్ధి సాధ్యమన్న జాతీయ పార్టీ నేతలు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా విద్యుత్, తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించలేదని ఎద్దేవా చేశారు. 70 ఏళ్లపాటు అధికారంలో ఉండి పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేపడితే తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారన్నారు. ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు అనిపించుకుంటూ కేసీఆర్ ప్రజాదరణతో ముందుకు వెళుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.