Andhra Pradesh: ఈ ఒక్క విషయంలో అయినా చంద్రబాబు, పవన్, కేఏ పాల్ కు క్లారిటీ ఉంది.. సంతోషం!: విజయసాయిరెడ్డి

  • ఎన్నికల్లో గెలిచేవారినే లక్ష్యంగా చేసుకుంటారు
  • వైసీపీ విజయం ఏపీలో ఖరారైపోయింది
  • అందుకే ముగ్గురూ జగన్ ను విమర్శిస్తున్నారు
సాధారణంగా ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న పార్టీనే అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, చివరికి కేఏ పాల్ కూడా వైసీపీ విజయం ఖరారైపోయిందని అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ నేతలంతా జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క విషయంలో అయినా ముగ్గురు నేతలకు క్లారిటీ ఉండటం సంతోషకరమైన అంశమని ఎద్దేవా చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చివరకు పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారు. అందుకే జగన్ గారి పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ విషయం లోనైనా మీ అందరికీ క్లారిటీ ఉంది. సంతోషం’ అని సెటైర్ వేశారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
Jana Sena
Pawan Kalyan
ka paul

More Telugu News