వీవీప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
- ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం
- వివరణ ఇవ్వాలంటూ ఈసీకి నోటీసులు జారీ
- తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్యాదవ్, సతీష్ చంద్ర మిశ్రాల నేతృత్వంలోని 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లవాసాలను కలిసి దీనిపై వినతిపత్రం అందజేశారు.
ఈసీ నుంచి సంతృప్తికర స్పందన లేకపోవడంతో వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి ఈసీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.