విద్యార్థుల పాఠ్య పుస్తకాలలోకి అభినందన్‌‌ జీవిత కథ!

  • రాజస్థాన్ లో పాఠ్యాంశంగా అభినందన్ సాహస గాథ
  • ప్రతిపాదించిన విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్
  • అభినందన్ విద్యాభ్యాసం జోధ్‌పూర్‌లో జరిగింది
పాక్ చేతుల్లో చిక్కినప్పటికీ ఏమాత్రం తొణక్కుండా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ సాహస గాథను రాజస్థాన్‌లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాస్ర.. అభినందన్ కథను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చారు.

అభినందన్ వైమానిక దాడుల సమయంలోనూ.. అనంతరం చూపిన ధైర్య సాహసాలు భావి తరాలకు చెందిన విద్యార్థులకు తెలియపరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అభినందన్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా ఆయనను గౌరవిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అభినందన్ విద్యాభ్యాసం జోధ్‌పూర్‌లో జరిగిందని గోవింద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Go Back to Shorts
Abhinandan
Rajasthan
Govind singh
Jodhpur
twitter

More Telugu News