Tollywood: మెగాస్టార్ ఇంటికెళ్లిన శివాజీ రాజా ప్యానెల్ సభ్యులు.. ‘మా’ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి!

  • ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు
  • ముగియనున్న శివాజీరాజా పదవీకాలం
  • ఇప్పటికే మెగాస్టార్ ను కలిసిన నరేష్
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. ప్రస్తుతం మా అధక్షుడిగా ఉన్న శివాజీరాజా పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు శివాజీరాజా ప్యానెల్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ కు విజ్ఞప్తి చేసింది.
మరోవైపు శివాజీరాజాకు పోటీగా నరేష్ ప్యానెల్ సభ్యులు ఇప్పటికే సినీప్రముఖులను కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవిని నరేష్ ప్యానెల్ కలుసుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబును సైతం నరేష్ కలుసుకున్నారు. కాగా, ఈరోజు మెగాస్టార్ ను శివాజీరాజా ప్యానెల్ కలుసుకున్న విషయాన్ని ప్రముఖ నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Tollywood
maa
elections
Chiranjeevi
support
Twitter
ba raju

More Telugu News