మూడు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్.. నేడు లాభాల జోరు!
- కలిసొచ్చిన ఐటీ, బ్యాంకింగ్ రంగ కొనుగోళ్లు
- 200 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్
- 10,863.50 వద్ద ముగిసిన నిఫ్టీ
- 36,064 వద్ద ముగిసిన సెన్సెక్స్
నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి.. 10,863.50 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 196 పాయింట్లు లాభపడి 36,064 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలో జీ ఎంటర్టైన్మెంట్, హిందూస్థాన్ పెట్రోలియం, ఐసీఐసీఐ, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు మాత్రం నష్టపోయాయి.