విమానంలో కాదు.. రోడ్డు మార్గం ద్వారానే అభినందన్ ను పంపుతాం!: స్పష్టం చేసిన పాకిస్థాన్

  • అభినందన్ కోసం విమానం పంపుతామన్న భారత్
  • రోడ్డు మార్గంలో చాలామంది ఉంటారని వ్యాఖ్య
  • భారత ప్రతిపాదనను తిరస్కరించిన దాయాది దేశం
భారత పైలట్ అభినందన్ ను ఈరోజు విడుదల చేస్తామని దాయాది దేశం పాకిస్థాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనను ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు తరలించారు. అక్కడి నుంచి వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారత్ లోకి ఆయన అడుగుపెట్టనున్నాడు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అభినందన్ వర్ధమాన్ ను తొలుత విమానం ద్వారా భారత్ కు తీసుకెళతామని అధికారులు ప్రతిపాదించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

అయితే ఇందుకు పాకిస్థాన్ తిరస్కరించిందట. రోడ్డు మార్గం ద్వారా వాఘా-అట్టారి సరిహద్దు వద్ద అభినందన్ ను అప్పగిస్తామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. వాఘా మార్గంలో ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నందున వాయు మార్గంలో తీసుకుని రావాలని కేంద్రం భావించినప్పటికీ పాక్ అంగీకరించలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Go Back to Shorts
India
Pakistan
wagha
abhinandan
iaf

More Telugu News