ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఉపఎన్నిక ప్రకటన విడుదల

  • ఎన్నికల సంఘం ప్రకటన విడుదల
  • ఎమ్మెల్సీల బరిలో పలువురు టీడీపీ నేతలు
  • యనమల, వర్ల రామయ్య, సబ్బంహరి తదితరులు  
ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఉపఎన్నికకు ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఎమ్మెల్సీల రేసులో యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, ఆదిశేషగిరిరావు, వర్ల రామయ్య, సబ్బంహరి, బుట్టా రేణుక, అజీజ్, శివనాగిరెడ్డి, పంచుమర్తి అనూరాధ, దాసరి రాజా మాస్టర్ ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల సమావేశం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో అమరావతి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీల ఖరారుపై తమ నేతలతో భేటీ కానున్నట్టు సమాచారం. నాలుగు ఎమ్మెల్యే కోటా, రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖాళీలపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు.
Go Back to Shorts
vizag
mla quota
govener quota
mlc
elections
Yanamala
varla
butta renuka
adi seshagiri rao

More Telugu News