modi: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఎయిర్ ఫోర్స్ దాడుల గురించి వివరించిన మోదీ

  • కోవింద్, వెంకయ్యలతో మోదీ భేటీ
  • వాయుసేన దాడులను వివరించిన ప్రధాని
  • అంతకు ముందు తన నివాసంలో హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన మోదీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు, ఆ దేశ ప్రధాన భూభాగమైన ఖైబర్ ఫక్తూంక్వా వరకు వెళ్లిన మన యుద్ధ విమానాలు... జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపత్రి వెంకయ్యనాయుడులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఎయిర్ స్ట్రైక్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా వారికి వివరించారు.

ఈ ఉదయం తన నివాసంలో హైలెవెల్ మీటింగ్ ను మోదీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏరియల్ స్ట్రైక్స్ నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో పాటు అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.
modi
Venkaiah Naidu
Ram Nath Kovind
Pakistan
air strikes

More Telugu News