‘సాక్షి’పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తా: చింతమనేని
- అసత్య కథనాలు రాస్తున్న‘సాక్షి’
- దళిత వ్యతిరేకిగా నాపై ముద్రవేసేందుకు కుట్ర
- జగన్ కు దమ్ముంటే దెందులూరులో పోటీ చేసి గెలవాలి
అసత్య కథనాలు రాస్తున్న‘సాక్షి’ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగానే చింతమనేని పైవ్యాఖ్యలు చేశారు. తనను దళిత వ్యతిరేకిగా ముద్రవేసి కుట్ర జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు దమ్ముంటే దెందులూరులో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.