రాజకీయాలు దారుణంగా మారిపోయాయి.. అభిమానంతో ఓటేసే పరిస్థితే కనిపించడం లేదు!: సినీ నటుడు సుమన్
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమన్
- ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపు
- ఆ నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్య
నిజంగా అభిమానంతో ఓటేసే పరిస్థితులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం, వారి సంక్షేమం, భవిష్యత్ కోసం కష్టపడే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆ నాయకుడు ఎవరో అందరికీ తెలుసని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వెళ్లి తలుపు కొట్టినా వెంటనే స్పందించే నేతలను ఎన్నుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను శ్రీవారిని కోరుకున్నట్లు సుమన్ చెప్పారు.