పుల్వామా దాడి అత్యంత భయంకరమైనది!: డొనాల్డ్ ట్రంప్
- ఉగ్రదాడి కలవరపరిచింది
- ఈ తరహా దాడులను ఖండించాల్సిందే
- ఇండియా, పాక్ లు కలసి ముందడుగు వేయాలి
- వైట్ హౌస్ లో మీడియాతో ట్రంప్
"ఈ సంఘటనపై ఎన్నో రిపోర్టులను పరిశీలించాను. సరైన సమయంలో మాట్లాడాలని అనుకున్నాను. వారు (ఇండియా, పాకిస్థాన్) కలసి నడిస్తే అద్భుతమే. అది జరగాలని కోరుకుంటున్నా. ఉగ్రదాడి దారుణమైన పరిస్థితే. ఇటువంటి వాటిని ఖండించాల్సిందే" అని అన్నారు. కాగా, దాడి తరువాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మాట్లాడుతూ, స్వీయ రక్షణ కోసం ఎటువంటి చర్యను తీసుకునేందుకైనా భారత్ కు హక్కుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.