ఎంపీ శివప్రసాద్ కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఘాటుగా స్పందించిన శివప్రసాద్!
- శివప్రసాద్ చాలా మంచి నటుడన్న మోదీ
- ప్రధాని ప్రశంసలు అవసరంలేదన్న శివప్రసాద్
- ప్రజలకు మేలు జరిగితే చాలని వ్యాఖ్య
కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘మోదీ నాకు అద్భుతమైన ప్రశంస ఇచ్చారు. అందరిని ఎగతాళి చేసినట్లు కళ గురించి మాట్లాడలేకపోయాడు. మోదీ ప్రశంస నాకు అవసరం లేదు. ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా నాకు ప్రశంస అవసరం లేదు. చంద్రబాబు పోరాటానికి మద్దతుగా హోదా కోసం నా వంతు కృషి చేశా. వేషధారణలో గిన్నిస్ రికార్డు నాకు అవసరం లేదు. ప్రజలకు మేలు జరిగి వారి ప్రేమ ఉంటే చాలు’ అని శివప్రసాద్ స్పష్టం చేశారు.