సరైన పత్రాలతో మళ్లీ రావచ్చంటూ... 8 మంది తెలుగు విద్యార్థులకు అమెరికా విముక్తి!

  • నకిలీ వర్శిటీ ఉచ్చులో ఎంతో మంది విద్యార్థులు
  • స్వచ్ఛందంగా దేశం విడిచి వెళతామని వినతి
  • అంగీకరించిన న్యాయస్థానం
అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు, ఎఫ్బీఐ కలిసి ఏర్పాటు చేసిన నకిలీ యూనివర్శిటీ ఫర్మింగ్టన్ ఉచ్చులో పడి, తాము తప్పు చేస్తున్నామని తెలిసి కూడా అమెరికాకు వెళ్లి అరెస్ట్ అయి ఇబ్బందులు పడ్డ 8 మంది తెలుగు విద్యార్థులకు ఊరట లభించింది. వీరి కేసు కోర్టుకు రావడంతో వారంతా తాము స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయమూర్తికి చెప్పడంతో, వారు తిరిగి ఇండియా వెళ్లేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

 అంతకుముందు ఈ కేసులో న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, మరోసారి అమెరికా రావాలని భావిస్తే, సరైన వీసా పత్రాలతో దర్జాగా రావచ్చని ఆయన తెలిపారు. కాగా, తమను జైలు నుంచి విడిపించేందుకు సహకరించిన తెలుగు సంఘాల ప్రతినిధులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇంకా 30 మంది వరకూ జైళ్లలో ఉండగా, మరో 50 మందికి పైగా జియో ట్యాగ్ అరెస్ట్ లతో బయట తిరుగుతున్నారు.
Go Back to Shorts
Fermington
University
Telugu Students
Court
Deport

More Telugu News