డీజీపీపై జగన్ ఆరోపణలు సరికాదు: చినరాజప్ప
- ఏపీ డీజీపీ ఠాకూర్ సమర్థవంతంగా పని చేస్తున్నారు
- కోర్టు తీర్పు ప్రకారం కొందరికి ప్రమోషన్లు ఇచ్చాం
- జగన్ పై ఉన్న కేసులను ఎత్తి వేసేందుకు కేంద్రం యత్నిస్తోంది
కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిన్న జగన్ కలిసిన సంగతి తెలిసిందే. డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా కోరారు. వారు విధుల్లో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులకు పెద్ద ఎత్తున ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు.