తెరపైకి ఓటుకు నోటు కేసు.. వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు

  • వారం రోజుల్లో కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు
  • త్వరలో రేవంత్, సండ్ర తదితరులకు నోటీసులు
  • రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపారని అభియోగం
తెలంగాణలో ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏసీబీ అభియోగ పత్రాల ద్వారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. త్వరలో ఈడీ.. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సహా ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్, సండ్ర, సెబాస్టియన్, ఉదయసింహా కలిసి కుట్ర పన్నారని ఏసీబీ అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముడుపులు ఇచ్చేందుకు నిందితులు ప్రయత్నించారని అభియోగ పత్రంలో పేర్కొంది.
Go Back to Shorts
Telangana
ACB
ED
Vem Narendar Reddy
Revanth Reddy
Sandra Venkata Veeraiah
Sebastian
Udaya Simha

More Telugu News