పాకిస్థాన్లో సివిల్ న్యాయమూర్తిగా హిందూ మహిళ సుమన్కుమారి
- సొంత జిల్లా కంబర్ షప్దత్కోట్లో సేవలందించనున్న కుమారి
- దేశంలో ఓ హిందూ మహిళకు జడ్జిగా తొలి అవకాశం
- గతంలో చీఫ్ జస్టిస్గా పనిచేసిన రాణాభగవాన్దాస్
పాకిస్థాన్లోని హైదరాబాద్ రాష్ట్రంలో ఎల్ఎల్బీ విద్యనభ్యసించిన కుమారి కరాచీలోని జబిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. లతామంగేష్కర్ అభిమాని అయిన సుమన్ కుమారి నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని యోచిస్తున్నారు. ‘నా కుమార్తెకు సవాళ్లతో కూడిన వృత్తిలో కొనసాగడం అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం దక్కింది. ఆమె కఠోర శ్రమతో నిజాయతీగా సేవలందించగలదని భావిస్తున్నాను’ అని కుమారి తండ్రి పవన్కుమార్ బోధన్ అన్నారు.