కెన్యాలో ఆత్మాహుతి దాడి... విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోయిన ఉగ్రమూకలు

  • తొలుత వాహనాలపైకి బాంబులు విసిరిన దుండగులు
  • 10 నుంచి 15 మంది చనిపోయినట్లు అనుమానం
  • నైరోబిలోని వెస్ట్‌ల్యాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ఘటన
కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. విదేశీయులే లక్ష్యంగా ఓ హోటల్‌పై దాడులకు తెగబడ్డారు. నైరోబిలోని వెస్ట్‌ల్యాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ‘డస్టిట్‌ డీ2’ హోటల్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో 10 నుంచి 15 మంది వరకు చనిపోయారని ప్రాథమికంగా నిర్థారించారు. వివరాల్లోకి వెళితే...విదేశీయులు అధికంగా ఉండే హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు తొలుత హోటల్‌ ప్రాంగణంలో పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలపైకి బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించారు. అనంతరం ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి అనంతరం ముష్కరులు తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలిలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయిన వారిలో ఓ అమెరికన్‌ కూడా ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకున్నా 10 నుంచి 15 వరకు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమాచారం అందగానే హుటాహుటిన చేరుకున్న భద్రతా బలగాలు హోటల్‌ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనను ఆ దేశ మంత్రి ఫ్రెడ్‌మాషియాంగ్‌ ఖండించారు. ఉగ్రమూకలు ఇటువంటి చర్యలతో తమని ఓడించలేవని ప్రకటించారు. కాగా, ఘటనకు తామే బాధ్యులమని ‘ఆల్‌ షహాబ్‌’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
Go Back to Shorts
kenya
sueicide bomber attack
incident in hotel

More Telugu News