అమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ.. వివాహ బంధంతో ఒక్కటైన యువతులు!
- కలిసి చదువుకున్న అమ్మాయిలు
- ఒకే సంస్థలో ఉద్యోగాలు
- పెద్దలు తిరస్కరించడంతో కోర్టుకు..
ఒడిశాలోని కేంద్రపడ పట్టణంలో జరిగిన ఈ స్వలింగ వివాహం స్థానికంగా సంచలనమైంది. పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన సావిత్రి, మోనాలిసా కటక్లో కలిసి చదువుకున్నారు. ఒకే హాస్టల్లో ఉండేవారు. చదువు పూర్తయ్యాక ఇద్దరికీ అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి. ఇద్దరూ ఓ గదిలో అద్దెకు ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు యువతులు ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. అందుకు వారు తిరస్కరించడంతో కోర్టును ఆశ్రయించారు. తమలో ఒకరిని భార్యగా, మరొకరిని భర్తగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేశారు.