ఇక్కడితో ఆగబోము: విరాట్ కోహ్లీ
- సిడ్నీ టెస్టులోనూ సత్తా చాటతాం
- బుమ్రా బౌలింగ్ అద్భుతం
- ప్రజెంటేషన్ సందర్భంగా కోహ్లీ
ఆటగాళ్లపై, వారి ఆటతీరుపై వచ్చే కామెంట్లు, విశ్లేషణలను తాను పట్టించుకోబోనని, తన టీమ్ మరింత బాగా ఆడాలని కోరుకుంటానని అన్నారు. ఈ మ్యాచ్ విజయం బౌలర్లదేనని, బుమ్రా అద్భుతంగా రాణించి, కీలక సమయాల్లో వికెట్లను పడగొట్టి, జట్టును గెలుపు దిశగా పరిగెత్తించాడని అన్నాడు. ఇక్కడ టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని వెళ్లే తొలి భారత కెప్టెన్ మీరే అవుతారా? అన్న ప్రశ్నకు, నిజంగా తన వద్ద జవాబు లేదని, తుది టెస్టును కూడా గెలవడమే లక్ష్యంగా ఆడతానని చెప్పాడు.