Pawan Kalyan: విరాళం ఇచ్చినందుకు నాగబాబు, వరుణ్ తేజ్ లకు కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

  • పార్టీకి రూ.25 లక్షల విరాళం అందజేసిన నాగబాబు 
  • వరుణ్ తేజ్ కోటి విరాళం 
  • జనసేనకి క్రిస్మస్ కానుకగా భావిస్తున్నట్లు పవన్ ప్రకటన
జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన నాగబాబుకి, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు . ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా చిన్న అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు, హీరో వరుణ్ తేజ్ లు పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాగబాబు గారు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ కోటి రూపాయల వంతున పార్టీకి విరాళం అందజేశారని  తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నాగబాబు, వరుణ్ తేజ్ లు అందించిన విరాళాలు పార్టీకి క్రిస్మస్ కానుకగా నేను భావిస్తున్నా' అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
nagababu
varuntej
Tollywood
janasena
Andhra Pradesh

More Telugu News