sensex: ఈ రోజూ లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు

  • ఉదయం మందకొడిగా ప్రారంభమైనా.. చివరకు లాభాలను గడించిన మార్కెట్లు
  • 159 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 10,686 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ... చివరకు ఉత్సాహంగా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 35,513కు పెరిగింది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 10,686కు చేరుకుంది.

టాప్ గెయినర్స్:

ఈఐహెచ్ లిమిటెడ్ (8.78%), వీఐపీ ఇండస్ట్రీస్ (7.51%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (6.83%), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (6.60%), డీసీఎం శ్రీరామ్ (4.99%).  

టాప్ లూజర్స్:

శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (-5.92%), పిరమల్ ఎంటర్ ప్రైజెస్ (-5.81%), జ్యోతి లేబొరేటరీస్ (-4.12%), గేట్ వే డిస్ట్రి పార్క్స్ (-4.08%), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ (-3.82%).   
sensex
nifty
stock market

More Telugu News