దుర్గగుడిలో మొమెంటోల కుంభకోణం.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఏఈవో అచ్యుతరామయ్య!
- తనను అన్యాయంగా ఇరికించారని వెల్లడి
- ఈవో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
- ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు
ఈ పిటిషన్ లో ఏపీ దేవాదాయ కమిషనర్ తో పాటు ఆలయ ఈవో కోటేశ్వరమ్మను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మవారి ఆలయంలో 1,200 మొమెంటోలు కొనుగోలు చేసిన అధికారులు ఆ సంఖ్యను మాత్రం 2,000గా చూపారు. ఆడిటింగ్ లో ఈ వ్యవహారం బయటపడటంతో ఏఈవో అచ్యుతరామయ్య సహా ముగ్గురిని బాధ్యులుగా తేల్చారు. దీంతో వీరిని విధుల నుంచి తప్పిస్తూ ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయం తీసుకున్నారు.