లీకులిస్తున్న కాంగ్రెస్... ఒప్పుకునేదే లేదంటున్న సీపీఐ!
- టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి
- ఇంకా తేలని సీట్ల పంపిణీ
- అసహనాన్ని వ్యక్తం చేసిన చాడ వెంకటరెడ్డి
ప్రాధాన్యత గల సీట్లను ఇవ్వకపోతే కూటమిలో కొనసాగడంపై పునరాలోచించుకోవడం మినహా మరో మార్గం లేదని ఆయన తేల్చిచెప్పారు. సీట్ల విషయంపై తమ పార్టీ శుక్రవారం నాడు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. కొత్తగూడెం సీటును తమకు ఇస్తామని ఒకసారి, ఇవ్వబోమని ఇంకోసారి కాంగ్రెస్ లీకులు ఇస్తోందని ఆయన ఆరోపించారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదని ఆయన అన్నారు. మహాకూటమిలో పొత్తు, సీట్ల పంపిణీ కుదరకుంటే, తాము 'ప్లాన్-బీ'ని అమలు చేసి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు.