విదేశీ టూర్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాం: సమంత

విదేశీ పర్యటనలో సరదాగా గడిపిన అక్కినేని కుటుంబం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. తమ టూర్ ముగించుకుని అక్కినేని కుటుంబం తిరిగి ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని నాగార్జున, సమంత తమ ట్వీట్ల ద్వారా తెలిపారు. అయితే, తమ పెళ్లిరోజు విషయాన్ని కూడా సమంత తన పోస్ట్ లో ప్రస్తావించింది. నాగచైతన్యంతో వివాహం తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఆయన పక్కనుంటే తనకు ఎంతో ధైర్యంగా ఉంటుందని చెప్పింది.


More Telugu News