Mirzapally Murder: మిర్జాపల్లిలో దారుణం: బండరాయితో కొట్టి యువకుడి హత్య

Mirzapally Murder Youth Killed with Stone in Medak District
షార్ట్స్‌లో చూడండి
మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని యువకుడిని దుండగులు బండరాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.

రైల్వే స్టేషన్ బ్రిడ్జి నుంచి చిన్నశంకరంపేట వైపు వెళ్లే రద్దీ రహదారిపై ఈ హత్య జరిగింది. ఈ మార్గంలో ఉన్న కొన్ని ఇనుప ఫ్యాక్టరీల సమీపంలోని ప్రమాదకరమైన మలుపు వద్ద యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి తలపై బండరాయితో బలంగా మోది చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడు ఎవరు, హంతకులు ఎవరు, హత్యకు గల కారణాలు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ దారుణ హత్యతో మిర్జాపల్లి గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
 
Go Back to Shorts
Mirzapally Murder
Medak District Crime
Youth Murder
Telangana Crime News
Mirzapally
Chinna Shankaram pet
Murder Investigation
Crime News Telangana

More Telugu News