నల్లధనం రారాజులు గుజరాతీలే.. బయటపెట్టిన ఐటీ శాఖ!
- ఒక్క వ్యాపారి వద్దే రూ.13 వేల కోట్ల అక్రమ సంపద
- దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల నల్లధనం
- సమాచార హక్కు చట్టం కింద బట్టబయలు
ఐడీఎస్ కింద ప్రకటించిన ఆస్తుల వివరాలను తెలపాలంటూ 2016, డిసెంబర్ 21న భరత్ సిన్హ్ జాలా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. ఈ విషయంలో రెండేళ్ల పాటు కొర్రీలు పెట్టిన ఐటీ శాఖ చివరికి వివరాలను బయటపెట్టిందన్నాడు. కాగా, గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి షా రూ.13,860 కోట్లతో ఈ జాబితాలో టాప్ లో నిలిచినట్లు ఐటీ శాఖ తెలిపింది. అయితే అక్రమ సంపాదన, నల్లధనానికి సంబంధించి పోలీసులు, ఉన్నతాధికారుల వివరాలను మాత్రం ఐటీ శాఖ బయటపెట్టలేదు.