'సుంకాల రారాజు' భారత్: ట్రంప్ వ్యంగ్యం
- మా ఉత్పత్తులపై భారత్ భారీ ఎత్తున సుంకాలను విధిస్తోంది
- మేము కూడా భారత్ ఉత్పత్తులపై సుంకాలను విధిస్తాం
- నన్ను సంతోషపరిచేందుకు వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమవుతోంది
భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, చైనాలతో వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. భారత్ ఉత్పత్తులపై తాము ఆంక్షలు విధిస్తే తట్టుకోలేమని భావించడం వల్లే... భారత్ వాణిజ్య ఒప్పందానికి సిద్ధమవుతోందని చెప్పారు.
అమెరికా దిగుమతులపై భారత్ 100 శాతం సుంకాలను విధిస్తోందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో... అది చేయకూడదని భారత్ భావిస్తోంది. అందుకే వారు మాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధమయ్యారు. ఇలాంటి ఒప్పందాన్ని గతంలో వారు ఎవరితో చేసుకోలేదు' అని ట్రంప్ చెప్పారు.
తమ ఉత్పత్తులపై భారత్ భారీ ఎత్తున సుంకాలను విధిస్తోందని... భారత ఉత్పత్తులపై తాము సుంకాలను విధించడం లేదని... కానీ, ఇకపై అమెరికాకు వచ్చే భారత ఉత్పత్తులపై 25 శాతం లేదా 10 శాతం లేదా ఎంతో కొంత సుంకాన్ని విధించాలనుకుంటున్నామని తెలిపారు.