చెన్నై చేరుకున్న కేసీఆర్, అఖిలేష్ యాదవ్

  • కరుణానిధికి నివాళి అర్పించనున్న కేసీఆర్, అఖిలేష్
  • అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించనున్న నేతలు
  • ఈ ఉదయమే నివాళి అర్పించిన మోదీ, మమత
దివంగత కరుణానిధిని చివరిసారి చూసుకునేందుకు, ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు దేశ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు చైన్నైకి తరలివస్తున్నారు. కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాజాజీ హాల్ కు వెళ్లి వారు నివాళి అర్పించనున్నారు. అనంతరం కరుణ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితర ప్రముఖులు కరుణకు నివాళి అర్పించారు.
Go Back to Shorts
kcr
akhilesh yadav
karunanidhi

More Telugu News