మీ రాజకీయ ఆందోళనతో ఏపీ అభివృద్ధి జరగదు: చంద్రబాబుకు జీవీఎల్ లేఖ

  • ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టద్దు
  • పరిపాలనపై దృష్టి సారించండి
  • కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి
మీ రాజకీయ ఆందోళనతో ఏపీ అభివృద్ధి జరగదని, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి జీవీఎల్ ఓ లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం మానుకోవాలని, పరిపాలనపై దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని, కేంద్రం అందిస్తున్న స్పెషల్ ప్రాజెక్టులను ఏపీ ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. ప్రకాశం జిల్లాకు నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.   
Go Back to Shorts
Chandrababu
gvl

More Telugu News