ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

  • చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలింపు
  • ప్రత్యేక చికిత్సలు అందిస్తున్న వైద్యులు
  • ఆందోళనకు గురవుతున్న అభిమానులు
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం అస్వస్థతకు గురయ్యారు. మణిరత్నానికి గుండెపోటు వచ్చింది. వెంటనే, ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించడంతో, ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీప్రముఖులు, అభిమానులు కోరుతున్నారు. కాగా, తెలుగు, తమిళం భాషల్లో పలు ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన వయసు 63 సంవత్సరాలు. మణిరత్నం సతీమణి ప్రముఖ సినీనటి సుహాసిని. 
Go Back to Shorts
mani ratnam
suhasini

More Telugu News