ఎన్డీయేకు దూరమవ్వాలనుకుంటున్న నితీశ్ కుమార్!
- బీజేపీ, జేడీయూల మధ్య పెరుగుతున్న దూరం
- లోక్ సభ సీట్ల పంపకాల విషయంలో తీవ్రమైన విభేదాలు
- మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్న నితీష్ కుమార్
లోక్ సభ సీట్ల పంపకం విషయంలో బీజేపీ, జేడీయూ పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ కు ఇటీవల నితీశ్ ఫోన్ కూడా చేసి, మాట్లాడారు. దీంతో, బీహార్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మహాకూటమిలోకి జేడీయూను మళ్లీ ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇటీవల కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేత ప్రకటించారు. అయితే, మహాకూటమిలోకి నితీశ్ ను మళ్లీ రానివ్వబోమంటూ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఏది ఏమైనా... మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.