రమణ దీక్షితులు పద్ధతి బాగోలేదు... న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: టీటీడీ ఛైర్మన్
- అమిత్ షా, జగన్ లను కలవడం సరైంది కాదు
- రోజుకో చోట ప్రెస్ మీట్లు పెడుతున్నారు
- భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
రమణ దీక్షితులుకు ఏదైనా సమస్య ఉంటే టీటీడీ పాలకమండలి దృష్టికి తీసుకురావాలని... మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. 24 ఏళ్లు ప్రధాన అర్చకుడిగా ఉండి, ఇప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని... దీని వెనుక కుట్ర ఉందని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న రమణ దీక్షితులుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.