వైసీపీ ఎంపీల రాజీనామాలపై అటా, ఇటా తేల్చనున్న స్పీకర్!
- ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన ఎంపీలు
- స్పీకర్ ఫార్మాట్ లో ఉండటంతో వారితో చర్చించనున్న సుమిత్ర
- నేడు స్పీకర్ ను కలవనున్న వైసీపీ ఎంపీలు
కర్ణాటకకు చెందిన ఇద్దరు లోక్ సభ సభ్యులు యడ్యూరప్ప, శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత, బల నిరూపణలో ఓటు వేసేందుకు ఎంపీ పదవులకు రాజీనామాలు చేయగానే, స్పీకర్ కార్యాలయం వాటిని ఆమోదించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నెలన్నర క్రితమే రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలపై నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ, స్పీకర్ కార్యాలయం నుంచి వైసీపీ ఎంపీలకు పిలుపురావడం గమనార్హం.