భారతీయ సినిమాలపై సంచలన నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్
- ఈద్ సందర్భంగా బాలీవుడ్ సినిమాలపై నిషేధం
- విదేశీ సినిమాలు ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు
- స్థానిక సినిమాలను ప్రోత్సహించేందుకే అన్న పాక్ ప్రభుత్వం
పాక్ లోని స్థానిక సినీ పరిశ్రమకు జీవం పోసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన నోటిఫికేషన్ లో పాక్ ప్రభుత్వం పేర్కొంది. నిషేధ సమయంలో కేవలం పాకిస్థాన్ కు చెందిన సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల వల్ల స్థానిక సినిమాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... తమ సినిమాలను ప్రదర్శించడానికి థియేటర్లు కూడా దొరకడం లేదని పాక్ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.