రేపు జనసేన 'నిరసన కవాతు'.. బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించతలపెట్టిన 'జన పోరాట యాత్ర' రేపటి నుంచి ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. రేపు ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపాసకుర్ది తీరప్రాంతం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం 11 గంటలకు స్వేచ్ఛావతి ఆలయంలోనూ పవన్‌ కల్యాణ్ పూజలు చేయనున్నారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు జనసేన నిరసన కవాతు నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సూరంగి రాజావారి మైదానంలో బహిరంగ సభ నిర్వహించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. 


More Telugu News