Kavach: రైలు ప్రమాదాలకు 'కవచ్' అడ్డుకట్ట... కీలక మార్గంలో సేవలు ప్రారంభం
రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చే దిశగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-హౌరా కారిడార్లోని ప్రయాగ్రాజ్-కాన్పూర్ సెక్షన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'కవచ్' ఆటోమేటిక్ రైలు భద్రతా వ్యవస్థను సోమవారం విజయవంతంగా ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రయాగ్రాజ్, కాన్పూర్ మధ్య సుమారు 190 కిలోమీటర్ల మార్గంలో ఈ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. రైలు నంబర్ 14163 ద్వారా ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురాగా, జనరల్ మేనేజర్ స్వయంగా సుబేదార్గంజ్ నుంచి మనౌరీ స్టేషన్ వరకు ఫుట్ప్లేట్ తనిఖీ నిర్వహించి పనితీరును సమీక్షించారు. డివిజనల్, హెడ్ క్వార్టర్స్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'కవచ్' వ్యవస్థ, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి రూపొందించబడింది. లోకో పైలట్ పొరపాటున రెడ్ సిగ్నల్ దాటినా, ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా బ్రేకులు వేసి రైలును నిలిపివేస్తుంది. రైలు వేగాన్ని, సిగ్నళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతను నిర్ధారిస్తుంది. ఈ వ్యవస్థతో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడం సాధ్యమవుతుంది.
తొలి దశలో చౌరీ చౌరా ఎక్స్ప్రెస్తో సహా 8 జతల రైళ్లకు ఈ సేవలను అందిస్తారు. రాబోయే నెలల్లో వందే భారత్ సర్వీసులతో పాటు మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించనున్నారు. ఈ వ్యవస్థను ప్రారంభించడానికి ముందు, రైల్వే శాఖ విస్తృతమైన ట్రయల్స్ నిర్వహించింది. వ్యాప్-7 ఇంజిన్లు, ఎల్హెచ్బీ కోచ్లు, 20 కోచ్ల వందే భారత్ రైలుతో ట్రయల్స్ జరిపి, విశ్వసనీయతను నిర్ధారించుకున్నారు. 20,000 కిలోమీటర్లకు పైగా ప్యాసింజర్ ట్రయల్స్ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తిచేశారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్లలోని కీలక సెక్షన్లతో కలిపి 1,450 కిలోమీటర్ల మార్గంలో 'కవచ్' వెర్షన్ 4.0ను ఏర్పాటు చేశారు. 'మిషన్ రఫ్తార్'లో భాగంగా తదుపరి దశలో ఘజియాబాద్-తుండ్లా సెక్షన్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ప్రయాగ్రాజ్, కాన్పూర్ మధ్య సుమారు 190 కిలోమీటర్ల మార్గంలో ఈ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. రైలు నంబర్ 14163 ద్వారా ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురాగా, జనరల్ మేనేజర్ స్వయంగా సుబేదార్గంజ్ నుంచి మనౌరీ స్టేషన్ వరకు ఫుట్ప్లేట్ తనిఖీ నిర్వహించి పనితీరును సమీక్షించారు. డివిజనల్, హెడ్ క్వార్టర్స్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'కవచ్' వ్యవస్థ, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి రూపొందించబడింది. లోకో పైలట్ పొరపాటున రెడ్ సిగ్నల్ దాటినా, ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా బ్రేకులు వేసి రైలును నిలిపివేస్తుంది. రైలు వేగాన్ని, సిగ్నళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతను నిర్ధారిస్తుంది. ఈ వ్యవస్థతో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడం సాధ్యమవుతుంది.
తొలి దశలో చౌరీ చౌరా ఎక్స్ప్రెస్తో సహా 8 జతల రైళ్లకు ఈ సేవలను అందిస్తారు. రాబోయే నెలల్లో వందే భారత్ సర్వీసులతో పాటు మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించనున్నారు. ఈ వ్యవస్థను ప్రారంభించడానికి ముందు, రైల్వే శాఖ విస్తృతమైన ట్రయల్స్ నిర్వహించింది. వ్యాప్-7 ఇంజిన్లు, ఎల్హెచ్బీ కోచ్లు, 20 కోచ్ల వందే భారత్ రైలుతో ట్రయల్స్ జరిపి, విశ్వసనీయతను నిర్ధారించుకున్నారు. 20,000 కిలోమీటర్లకు పైగా ప్యాసింజర్ ట్రయల్స్ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తిచేశారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్లలోని కీలక సెక్షన్లతో కలిపి 1,450 కిలోమీటర్ల మార్గంలో 'కవచ్' వెర్షన్ 4.0ను ఏర్పాటు చేశారు. 'మిషన్ రఫ్తార్'లో భాగంగా తదుపరి దశలో ఘజియాబాద్-తుండ్లా సెక్షన్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
